Saturday, May 4, 2024
- Advertisement -

బాలయ్య కోసం పెన్ పదును పెడుతున్న పరుచూరి బ్రదర్స్

- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక లో తన తదుపరి చిత్రం బోయపాటి శ్రీను తో ఉంటుంది అని అనౌన్స్ చేసాడు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ పూర్తి అయ్యి విడుదల ఆయె సరికి సీన్ రివర్స్ అయిపొయింది. అటు బోయపాటి కాక, ఇంకో పక్క వినాయక్ కాక, ఈ సినిమా కేఎస్ రవికుమార్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటె, ఎప్పటి నుంచో వినాయక్ ఎలాగైనా సరే బాలకృష్ణ తో సినిమా చేయాలి అని కూర్చున్నాడట. బాలకృష్ణ కి ఎన్ని కథలు నచ్చకపోయినా ఏదో ఒక కొత్త కథ ని ముందుకు తీసుకొని వస్తున్నాడట.

ఇదే కాక ఇండస్ట్రీ లో తనకి పరిచయం ఉన్న రచయితలందరినీ కథల కోసం సంప్రదిస్తున్నాడు వినాయక్. చివరికి వినాయక్ ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. బాలకృష్ణ తో ఎలాగో ఒక మాస్ కథ తో సినిమా తీయాలి అనుకున్న వినాయక్ మాస్ కథల లో ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన పరుచూరి బ్రదర్స్ ని అప్రోచ్ అయ్యాడట. ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ బాలకృష్ణ కోసం మంచి కథ ని తీర్చిదిద్దే పని లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కథ ఓకే అయితే గనుక మనం మళ్ళి నరసింహ నాయుడు తరహా లో యాంగ్రీ అండ్ అగ్రెస్సివ్ బాలకృష్ణ ని తెరపై చూడొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -