Friday, April 26, 2024
- Advertisement -

12 నుంచి ‘ఏకే’ షూటింగ్​.. జాయిన్​ కాబోతున్న నిత్య

- Advertisement -

రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇచ్చిన పవన్​ కల్యాణ్​.. వరస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లాక్​డౌన్​ సడలింపుల్లో విడుదలైన వకీల్​ సాబ్​ రికార్డ్​ కలెక్షన్లు రాబట్టింది. ఇక అదే ఊపుతో క్రిష్ డైరెక్షన్​లో హరిహరవీరమల్లు అనే చారిత్రక చిత్రంలో, మలయాళ రీమేక్​ అయ్యప్పనుమ్​ కోషియమ్​ లో పవర్​ స్టార్​ నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే కరోనా సెకండ్​వేవ్​ ఎఫెక్ట్​తో ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్ ఆగిపోయింది. అయ్యప్పనుమ్​ కోషియమ్​ షూటింగ్​ ఈ నెల 12 నుంచి మళ్లీ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్​లో నిత్యమీనన్​.. పవన్​ కల్యాణ్​ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. ఈ మలయాళ రీమేక్​ కు సాగర్​ కే .చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ స్క్రీన్​ ప్లే, మాటలు త్రివిక్రమ్​ అందిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Also Read: ప్రభాస్​ సినిమాలో కాజల్​ ఐటెం సాంగ్…

మరోవైపు ఈ మూవీకి ఇంకా టైటిల్​ ఫిక్స్​ చేయలేదు. త్రివిక్రమ్​ ఈ సినిమా టైటిల్​ కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. పవన్​ కల్యాణ్ తో పాటు మరో నటుడు దగ్గుపాటి రానా కూడా ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్​ కనిపించబోతున్నది. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత పవర్​ స్టార్​.. హరీశ్​ శంకర్​ డైరెక్షన్​లో ఓ మూవీ చేయబోతున్నాడు.

Also Read: థియేటర్స్​ .. ఎప్పటికి తెరుచుకుంటాయి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -