రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇచ్చిన పవన్ కల్యాణ్.. వరస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సడలింపుల్లో విడుదలైన వకీల్ సాబ్ రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. ఇక అదే ఊపుతో క్రిష్ డైరెక్షన్లో హరిహరవీరమల్లు అనే చారిత్రక చిత్రంలో, మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియమ్ లో పవర్ స్టార్ నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే కరోనా సెకండ్వేవ్ ఎఫెక్ట్తో ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్ ఆగిపోయింది. అయ్యప్పనుమ్ కోషియమ్ షూటింగ్ ఈ నెల 12 నుంచి మళ్లీ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో నిత్యమీనన్.. పవన్ కల్యాణ్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. ఈ మలయాళ రీమేక్ కు సాగర్ కే .చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Also Read: ప్రభాస్ సినిమాలో కాజల్ ఐటెం సాంగ్…
మరోవైపు ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. త్రివిక్రమ్ ఈ సినిమా టైటిల్ కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. పవన్ కల్యాణ్ తో పాటు మరో నటుడు దగ్గుపాటి రానా కూడా ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్ కనిపించబోతున్నది. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత పవర్ స్టార్.. హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు.
Also Read: థియేటర్స్ .. ఎప్పటికి తెరుచుకుంటాయి?