Thursday, May 9, 2024
- Advertisement -

ఎల్లోమీడియా గుట్టు విప్పునున్న‌ మెగా ఫ్యామిలీ… కాసేప‌ట్లో మీడియా స‌మావేశం

- Advertisement -

ప‌వ‌న్‌, ఆయ‌న త‌ల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై మెగా ఫ్యామిలీ అంతా డైరెక్ట్‌గా దిగ‌డంతో ఇప్పుడు ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందోన‌ని రాజ‌కీయా వ‌ర్గాల్లో అల‌జ‌డి రేగుతోంది. త‌మ కుటుంబాన్ని ఎల్లోమీడియా, లోకేష్ టార్గెట్ చేశార‌ని దానికి వ్య‌తిరేకంగా ఫిలింఛాంబ‌ర్ ముందు ధ‌ర్నా చేయ‌నున్నారు.

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఖండిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మ‌రో పోరాటినికి సిద్ధ‌మ‌వ‌తున్నారు. తన న్యాయవాదులతో ఫిల్మ్‌ ఛాంబర్‌లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్‌ వెంటనే సోదరుడు నాగబాబు, మా ప్రెసిడెంట్‌ శివాజీరాజా కూడా ఉన్నారు. అనూహ్యంగా అల్లు అర్జున్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ నల్లటి దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తన తల్లిని బహిరంగంగా దూషించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం నుంచి ఆయన వరుస ట్వీట్లతో తన ఆగ్రహాన్ని వ్యక్త పరుస్తున్నారు. తన తల్లిని తిట్టించడంలో బీజేపీ బాసులకు టీవీ9 రవిప్రకాశ్, రామ్ గోపాల్ వర్మ, శ్రీసిటీ యజమాని శ్రీని రాజులు సహకరించారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే మీడియా స‌మావేశంలో ప‌వ‌న్ ఏం మాట్లాడుతారోన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -