నిన్న అంతా సోషల్ మీడియా లో ఒక ప్రత్యేకమైన ఫోటో వైరల్ అయినా సంగతి మనకి తెలిసిందే. అయితే ఆ ఫోటో లో ఉన్నదీ మాములు వ్యక్తులు కాదు, అందుకే అంతలా వైరల్ అయింది. విషయానికి వస్తే నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన జనసేన పార్టీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ తో కలిసి అన్నయ్య చిరంజీవి ని కలిశారు. అయితే ఆ మీటింగ్ తాలూకు ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయింది.
ఎందుకు కలుసుకున్నారు అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. అధికారికం గా మీటింగ్ అజెండా గురించి ఎవరూ ప్రకటించలేదు కానీ మీడియా లో మాత్రం ఈ విషయం గురించి విచ్చలవిడిగా పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొంత మంది ఈ మీటింగ్ ని రాజకీయ కోణం లో కూడా చూస్తున్నారు కానీ అందులో వాస్తవం లేదని తెలుస్తుంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చిరంజీవి నటించిన సై రా నరసింహ రెడ్డి సినిమా లో వాయిస్ ఓవర్ గురించి పవన్ కళ్యాణ్ ని అడుగగా, ఆ విషయం మాట్లాడటానికి పవన్ తన అన్నయ్య ని కలిసాడు అని తెలుస్తుంది. ఒకవేళ పవన్ ఒప్పుకుంటే మాత్రం, సినిమా కి ఉన్న బజ్ మరింత పెరుగుతుంది.