Sunday, April 28, 2024
- Advertisement -

‘ఉప్పెన’ మ‌రో రంగ‌స్థలం: పవన్

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వెండితెర‌పైకి ఎంట్రీ ఇస్తున్నమ‌రో నూత‌న న‌టుడి సినిమాపై సినీ వ‌ర్గాల్లో మంచి పాజిటివ్ టాక్ న‌డుస్తోంది. ఆ సినిమాయే ఉప్పెన. వైష్ణ‌వ్ తేజ్ ఈ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌మ‌వుతున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ అంటూ సాగే పాట‌తో పాటు ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్రోమోల‌తో ఒక్క‌సారిగా భారీ అంచ‌నాలు పెంచేశాయి.

దీనికి తోడు సినీ వర్గాల‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా స్టోరీ అద్భుతంగా ఉంద‌ని చెప్ప‌డం కూడా ఈ సినిమాపై అంద‌రికీ ఆస‌క్తి నెల‌కొన్న‌ది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ను భారీ ఎత్తున్న నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఉప్పెన యూనిట్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆ సినిమా ట్రైల‌ర్ చూపించ‌డంతో.. ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఉప్పెన ట్రైల‌ర్ త‌న‌ను ఎంత‌గానో అక‌ట్టుకుంద‌ని ప‌వ‌న్‌ తెలిపారు. ఈ సినిమాను బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ దంగ‌ల్‌, టాలీవుడ్ సంచ‌ల‌నం రంగ‌స్థ‌లం మూవీల‌తో పోల్చారు. అలాగే, అద్భుత‌మైన క‌థ‌తో చిత్రాన్ని తీస్తున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబును సైతం ప‌వ‌న్ ప్ర‌శంసించారు. అలాగే, వైష్ణ‌వ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించార‌నీ, ఇప్పుడు ఈ స్థాయికి రావ‌డం సంతోషంగా ఉంద‌నీ, ఉప్పెన మంచి విజయం సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్టు ప‌వ‌న్ తెలిపారు. కాగా, ఈ సినిమా ఈ నెల 12న విడుద‌ల కానుంది.

హిందీ పాట‌తో కుర్ర‌కారుకు హీటెక్కిస్తానంటున్న ర‌ష్మిక‌

నువ్వా..? నేనా ? అంటూ పోటిప‌డుతున్న మ‌హేష్ బాబు, ప్ర‌భాస్

ఉద‌య‌భాను సినీ ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం ఏంటి ?

ఇక యుగం అంతం కానుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -