Saturday, April 27, 2024
- Advertisement -

అన్యాయం జరుగుతోందని పవన్ అభిమానుల ఆక్రోశం!

- Advertisement -

మా అభిమాన హీరో ఫ్లెక్సీలనే తగలబెట్టారు. అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తే.. ఇప్పుడు మా మీదే కేసులు పెట్టారు. మా వల్లనే అరెస్టు చేశారు.. అని అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు.

ఈ విషయంలో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో పవన్ అభిమానుల ఆందోళనలను కొనసాగుతున్నాయి. తమ వాళ్లను అరెస్టు చేయడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వారు పోలీస్ స్టేషన్ ను ముట్టడించి నిరసన తెలిపారు. ఒకవైపు నగరంలో 144 సెక్షన్ విధించి ఉన్నా.. పవన్ అభిమానులు ర్యాలీ కూడా తీయడం గమనార్హం.

ఇప్పటి వరకూ పవన్ అభిమానులను పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అభిమానుల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతోంది. ధర్నా నెపంతో పోలీసులు పవన్ అభిమానులను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను చించేసి దగ్దం చేయడంపై పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ పనిచేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య రచ్చ మొదలైంది. తాజాగా పవన్ అభిమానులను అరెస్టు చేయడంతో అభిమానులకు మరింత కోపం వచ్చింది.

తమ హీరో ఫ్లెక్సీలనే చించేసి.. దగ్ధం చేసి… ఇప్పుడు మళ్లీ తమ వాళ్లనే అరెస్టు చేయడం ఏమిటి? అని వారు నిలదీస్తున్నారు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్ ను వారు ముట్టడించారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ పవన్ అభిమానులను విడుదల చేయలేదు. మరి ఈ గొడవ ఎప్పటికి.. ఎలా సద్దుమణుగుతుందో ఏమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -