ఇప్పటికి తెలుగులో టాప్ హీరో పవన్ కల్యాణే అని అంటారు అతడి అభిమానులు. ఈ విషయంలో తమ స్టార్ కు తిరుగులేదని.. ఆయన పవర్ స్టార్ అని… వారు చెబుతుంటారు.
మిగతా హీరోలు కూడా ఇదే స్థాయిలో ఉన్నా తమ హీరో మాత్రం టాప్ అని వారు అంటారు. అయితే త్వరలోనే పవన్ ను మించి పో్యే హీరోని అందరూ చూడబోతున్నారట. ఇప్పటికే కొన్ని సినిమాలతో పరిచయం ఉన్న అతడు మరో రెండు సినిమాల్లోనే పవన్ ను మించి పోతాడట.
అతడు మరెవరో కాదు.. పవన్ మేనల్లుడే. సాయిధరమ్ తేజ్. ఇతడు నాలుగో సినిమాతోనే పవన్ స్థాయికి చేరుకొంటాడని అంటున్నాడు నిర్మాత దిల్ రాజు. సాయిధరమ్ తేజ్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాను రూపొందించిన రాజు ఆ హీరోని ఆకాశానికెత్తేయడంలో భాగంగా ఈ ప్రకటన చేశాడు. ఆ కుర్రాడు పవన్ కల్యాణ్ స్థాయికి చేరుతాడని.. అది కూడా నాలుగో సినిమాతోనే సాధ్యం అవుతుందని అనేశాడు.
మరి ఈ పొగడ్త కొంచెం ఓవర్ అయ్యిందనే అనుకోవాల్సి వస్తోంది. పొగిడితే పొగవచ్చు కానీ.. మరీ పవన్ కల్యాణ్ స్థాయికి అంటే అది విచిత్రమే. ఎందుకంటే.. ఈ హీరో ఇంకా పవన్ పేరును చెప్పుకొనే స్థాయిలోనే ఉన్నాడు. అంతలోకే ఆ స్థాయికి చేరిపోతాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. మరి దిల్ రాజు అలా చెబుతున్నాడు. అది కూడా నాలుగో సినిమాతోనే అంటున్నాడు కదా.. మరి చూద్దాం!