Monday, April 29, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ !

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగులో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఆడంరికి తెలిసిందే. ఆయన సినిమాలు హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ వుంటాయి. ఇక పవన్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికి సినిమాల్లో కూడా నటిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఈ ఏడాది బీమ్లా నాయక్ తో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ ఆ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ” హరి హర వీరమల్లు ” అనే మూవీ చేస్తున్నారు పవన్. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది అయితే పవన్ పోలిటికల్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది ఫలితంగా మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఆన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ షూటింగ్ వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉండడంతో మూవీ సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మూవీ సమ్మర్ కు కూడా రిలీజ్ కావడం కష్టమేనట.

కానీ ఈ సమ్మర్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు మరో అదిరిపోయే ఆప్డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ కల్యాణ్ కెరియర్ లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ” ఖుషీ ” . 2001 ఏప్రెల్ 26న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పవన్ కు యూత్ లో తిరుగులేని ఇమేజ్ ను కట్టబెట్టిన మూవీ ఖుషీ నే. అందుకే పవన్ అభిమానులు ఖుషీ మూవీని ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి ఎవర్ గ్రీన్ మూవీని ఈ సమ్మర్ లో రీరిలీజ్ చేయనున్నారు. ఈ సమ్మర్ కానుకగా 2023 ఏప్రెల్ 27న ఈ మూవీని రీరిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మళ్ళీ 22 ఏళ్ల తరువాత ఖుషీ మూవీ ఇప్పుడు 4k లో రిలీజ్ అవుతుండడంతో మూవీకోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మహేశ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ !

సలార్ లో విజయ్ దేవరకొండ ?

చిరును వెనక్కి నెట్టిన బాలయ్య!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -