నేషనల్ స్టార్ ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ” సలార్ “. ఈ మూవీపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజిఎఫ్ సిరీస్ తో నేషనల్ వైడ్ గా మంచి పేరు సంపాధించుకున్న ప్రశాంత్ నీల్ తరువాతి సినిమా కావడం.. ఆది కూడా ప్రభాస్ లాంటి నేషనల్ స్టార్ హీరోగా ఉండడంతో ” సలార్ ” మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన పోస్టర్స్ లో ప్రభాస్ లుక్ ఊర మాస్ గా ఉండడంతో మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో ఇతర ఇండస్ట్రీ హీరోలు కూడా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృధ్వీ రాజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతోంది. రౌడీ హీరోగా యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఈ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఇప్పటికే విజయ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల ముంబైలోని సలార్ సెట్ లో విజయ్ దేవరకొండ అంటూ సోషల్ మీడియా లో రౌడీ హీరో ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఈ వార్తలు నిజమేనని భావించరంతా. అయితే విజయ్ సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, విజయ్ ఓ యాడ్ షూటింగ్ కోసం ముంబై వెళ్లారని, అవి అక్కడి ఫోటోలు అంటూ చెబుతున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ మరియు విజయ్ దేవరకొండ మల్టీస్టారర్ గా మూవీ రావాలని కోరుకుంటున్నారు. మరి క్రేజీ కాంబినేషన్ ఫ్యాన్స్ కోరిక మేరకు మల్టీస్టారర్ గా తెరపైకి వస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి
ఆదిపురుష్ వచ్చే ఏడాది కూడా కష్టమే !