పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన ఫ్యాన్స్ ని.. మిత్రులనూ గిఫ్టులతో థ్రిల్ చేస్తుంటాడు.. వారిని సంతోషపెడుతుంటాడు. పవన్ ఎక్కువ న్యాచురల్ అండ్ సింపుల్ థింగ్స్ పంపించి థ్రిల్ చేస్తుంటాడు. ఇప్పటికే పరిశ్రమలో చాలామంది పవన్ ఫామ్ లో పండిన మామిడిపళ్ళను తిన్న సంగతి తెలిసిందే. వారికి ప్రతీ ఏడాది ఈయన దగ్గర నుండి మామడిపళ్ళు వచ్చేస్తాయి.
ఇప్పుడు కొందరు ఫ్యాన్స్కు అదే విధంగా పుస్తకాలు వచ్చేస్తున్నాయి తెలుసా!! ఇటివలే పవన్ అమెరికా వెళ్లినప్పుడు అక్కడి ఎన్నారై అభిమానులు కొందరు.. పవన్ కోసం వందల కార్లలో ర్యాలీగా వచ్చారు. న్యాష్ విల్ అనే టౌన్ నుండి ఈ ర్యాలీ జరిగింది.
అందుకే ఇప్పుడు పవన్ అక్కడ ర్యాలీలో పాల్గొన్న ఫ్యాన్స్కి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని తను స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి మరీ పంపేశాడు. ప్రస్తుతం మనోడు ఇటలీలో షూటింగులో ఉండగా.. ఈయన పంపిన పుస్తకాలు అందుకున్న అమెరికా ఎన్నారైలు ఉబ్బితబ్బిబైపోతున్నారు. గతంలో అసలు ఆధునిక మహాభారతం పుస్తకం అచ్చు కాపీలు మార్కెట్లో కనుమరుగైపోతున్న టైంలో.. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పుస్తకం ప్రతులను ప్రింటింగ్ చేయించిన విషయం తెలిసిందే.
Related