‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ చాలా మందికి షాక్ ఇస్తోంది. శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ కు యూట్యూబ్ లో ఇప్పటి వరకు 5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. అయితే ఈ టీజర్ కు లక్షకుపైగా లైక్స్, అదే స్థాయిలో డిస్ లైక్స్ రావడం అందరిని షాక్ చేస్తోంది. దీనితో ఈ వ్యవహారం అంతా పవన్ అల్లుఅర్జున్ అభిమానుల మధ్య జరుగుతున్న వార్ కు పరాకాష్టగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ డిస్ లైక్స్ వ్యవహారం వెనుక పవన్ ఫ్యాన్స్ హస్తం ఉందన్న అనుమానాలు ఇప్పటికే చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కు ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ తీసిన సినిమా అని కూడ లెక్క చేయకుండా పవన్ అభిమానులు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ఇలాంటి పరిస్థుతులలో హరీష్ శంకర్ చేసిన లేటెస్ట్ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ‘నిప్పులు చిమ్ముకుంటూ – నింగికి నే ఎగిరిపోతే – నిబిడాశ్చర్యం లో వీరు – నెత్తురు కక్కుకుంటూ నెలకు నే – రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే – యద్భావం తత్ భవతి.’ అంటూ హరీష్ శంకర్ తన కోపాన్ని ‘దువ్వాడ జగన్నాధం’ టీజర్ ను అయిష్టపడుతున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ ట్విట్ చేసాడు. మరి హరీష్ శంకర్ చేసిన ఈ ట్విట్ పై అల్లు అర్జున్ ని వ్యతిరేకిస్తున్న వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.
{youtube}GOrBqS0rGy4{/youtube}
Related