కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోన్న కథానాయికల జాబితాలో పాయల్ రాజ్ పుత్ ముందువరుసలో ఉంటారు. ఆర్ఎక్స్ 100తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో తన అందాలతో కుర్రకారుని తన వైపు తిప్పుకుంది. దీంతో వరుసగా తెలుగులో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోందోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు వున్నాయి. నాగార్జున మన్మథుడు 2తో పాటు వెంకటేష్ వెంకీ మామా సినిమాలో నటిస్తుంది పాయల్.
ఈ మూడు సినిమాల్లో మరోకటి ‘టైగర్ నాగేశ్వర్రావు’ కనిపిస్తుంది.బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో పాయల్ అలరించనుంది. ఈ సినిమాలో ఆమె ఓ వేశ్యగా కనిపించనున్నట్టుగా సమాచారం. ఈ పాత్రలో ఆమె చాలా బోల్డ్ గా వుంటుందట. 1980 – 90 దశకాల్లో స్టూవర్ట్ పురం గజదొంగగా జనాలను భయపెట్టేసిన ‘టైగర్ నాగేశ్వర్రావు’ బయోపిక్ ఇది.
వంశీకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ‘టైగర్ నాగేశ్వర్రావు’గా బెల్లంకొండ చేసే దొంగతనాలకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.