తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకొని సంచలన విజయాలు అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ, రీతూ వర్మతో తీసిన పెళ్లిచూపులు సూపర్ హిట్ నిలిచింది. చాన్నాళ్ల తర్వాత జాతీయ అవార్డులు వరుసగా కట్టాయి. ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్ తీసే తర్వాతి సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ అంచనాలతో సంబంధం లేకుండా ఓ రోడ్డు థ్రిల్లర్ సినిమాను తీయనున్నట్టు తెలుస్తోంది.
రెండో సినిమా రెండో సినిమాతో ప్రస్తుతం తరుణ్ బిజీ అయ్యాడు. ఈయన సినిమా కోసం రోడ్డెక్కనున్నాడు. పెళ్లి చూపులు తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని ఓ రోడ్ థ్రిల్లర్ కథ సిద్ధం చేసుకున్నాడు. తన మొదటి సినిమాకు సహకరించిన సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. అయితే ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్లతోనే తీయనున్నారట. హిందీలో వచ్చిన హైవే సినిమా తరహాలో ఈ రోడ్ థ్రిల్లర్ ఉండనుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం గోవాలోనే ఎక్కువ భాగం తీయనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.