తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో వివిధ పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న నటుడు పొన్నంబళం. గత రెండు దశాబ్దాల కాలంలో నటుడు పొన్నాంబళం రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విక్రమ్ లాంటి ప్రముఖ నటులతో నటించారు. వాస్తవానికి ఆయన స్టంట్ మ్యాన్గా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన నాట్టమై చిత్రంతో మంచి ప్రేక్షకాదరణ పొందారు. ప్రస్తుతం పొన్నాంబళం అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు కిడ్నీ సమస్య ఉత్పన్నంకావడంతో చైన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు.
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రమాదం నుండి బయటపడాలంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని అన్నాడు. నా సహోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసాడు. అయితే ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తన కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేక కూమిలిపోతోందని ఓ ప్రకటనలో తెలియజేశాడు. అయితే పొన్నాంబళం కిడ్నీ సంబంధిత సమస్యలతో అనారోగ్యం బారిన పడటంతో సినిమాలకు దూరం అయ్యారు.
దాంతో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా మారింది. రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ధాను ధనుష్, కె ఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్, ఐసరి గణేష్ వంటి ప్రముఖులు ఇప్పటికే పొన్నంబళంకు ఆర్ధిక చేయం చేయగా, ఇప్పుడు కిడ్నీ మార్పిడి కోసం దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్ తరపున తగిన ఆర్ధిక సాయం అందించాలని నటుడు పొన్నంబళం వేడుకొన్నారు.
ఆ నలుగురిపై పిడుగు పడింది.. కానీ..
బెంగాల్లో పోలిటికల్ హీట్.. తృణమూల్ గూటికి యశ్వంత్ సిన్హా