ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల బీభత్సం కొనసాగుతుంది. కరోనాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ మద్యనే పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు కన్నుమూశారు. తాజాగా సినీ దర్శకుడు, రచయిత నంద్యాల రవికి కరోనా సోకడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
నంద్యాల రవి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా సోకి, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న హాస్య నటుడు తన మంచి మనసు చాటుకున్నారు. నంద్యాల రవికి సినీ హాస్య నటుడు సప్తగిరి తన వంతుగా రూ.లక్ష సాయం అందించి మంచి మనసును చాటుకున్నాడు. నంద్యాల రవికి కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) నుంచి కూడా కొంత సాయం అందినట్లు తెలిసింది. ప్రస్తుతం నంద్యాల రవి దర్శకత్వంలో సప్తగిరి ఓ సినిమా చేస్తున్నాడు.
ప్రభుత్వానికి నమ్రత శిరోద్కర్ కీలక సూచనలు.. వైరల్ !..
ఇంట్లోనే అలాంటి పని చేస్తూ చెమటోడుస్తున్న సురేఖా వాణి.. వైరల్!