Wednesday, May 1, 2024
- Advertisement -

పూజా హెగ్డే తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటీవల పూజా నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆలరించడం పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు ఆమె గ్లామర్‌ స్టామినా ఏంటో తెలియజేశాయి. ప్రస్తుతం ఈ బుట్ట బొమ్మ టాలీవుడ్‌లో వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక వరుస హిట్లు రావడంతో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్ల నుంచి నూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో నయనతారతో పోటీ పడుతోంది.

ప్రస్తుతం ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ బుట్ట బొమ్మ తొలి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ భామ తొలిసారి జీవా హీరోగా నటించిన ‘మూగముడి’ సినిమాతొ హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా కోసం రూ. 30 లక్షల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. అలా తొలిసారి వచ్చిన సంపాదనతో పూజా హెగ్డే బీఎండబ్ల్యూ5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఆ కారు అంటే పూజాకు ప్రాణం అట. ఇప్పటికీ ఆ కారు తన ఇంట్లోనే దాచుకుందట.

ప్రస్తుతం ఈ బ్యూటీ.. ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తోంది. ఈ సినిమాను బాహుబలి సినిమా విడుదలైన ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, సల్మాన్ ఖాన్ తో‘కభీ ఈద్ కభీ దీవాళీ’సినిమా చేస్తోంది.

పాపం ఈ అమ్మ‌డి ఆశ‌ల‌న్నీ దానిపైనే..

వామ్మో.. నెలలో ప్రదీప్ ఇన్ని లక్షలు సంపాదిస్తాడా!

త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న ప్రభాస్!

ప్రియాంక‌పై క‌న్నేసిన స‌లార్ డైరెక్ట‌ర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -