- Advertisement -
బ్లాక్బ్యూటి పూజాహెగ్డె వరుస ఆఫర్లతో ఫుల్ బిజిగా ఉంది.ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అరవింద సమేత సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.దీంతోపాటు మహేష్ బాబు 25వ సినిమాలో కూడా పూజ హీరోయిన్గా చేస్తుంది.బెల్లంకొండ శ్రీనివాస్తో సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. అయితే తాజాగా పూజ తన వ్యసనం గురించి చెప్పుకొచ్చింది.
పూజా హెగ్డేకు వ్యసనంగా మారిన విషయమేమిటంటే.. ఆమెకు కూలింగ్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం అంట. ఎక్కడకు వెళ్ళినా మొదట కోనేవి మాత్రం అవే అంటోంది ఈ బ్యూటీ.దాన్ని మానేయాలని ఎంతగా ప్రయత్నించిగా ఫలితం మాత్రం ఉండటం లేదని చెబుతుంది.అయిన అవి నా అందం కాపాడుతున్నాయి కాబట్టే, నా మనస్సు వాటిపైకి వెళ్తుందని తెలిపింది.