3డీ మూవీస్ చూస్తే ఆ థ్రిల్లే వేరు. ఇక భారీ గ్రాఫిక్స్ తో హై బడ్జెట్ మూవీ కనుక 3డీలో తెరకెక్కితే సినిమా ప్రేక్షకులకు పండుగే. అలాంటి సినీ సంరంబానికి సర్వం సిద్ధమైంది. ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీస్ లో ఆదిపురుష్ ఒకటి. భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం ఆధారంగా 400 కోట్ల హై బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో రాముడిగా ప్రభాస్, సితగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని 3డీలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టి – సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ , రాజేష్ నాయర్ సంయుక్తంగా ఆదిపురుష్ ను తెరకెక్కిస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా తీసుకురాబోతున్నారు. 2023 జనవరి 12న ఈ చిత్రం విడుదల కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే. స్పిరిట్ తదితర సినిమాలతో బిజీగా ఉన్నాడు.
సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారా ?
సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సోనాలి