Friday, May 3, 2024
- Advertisement -

అనుష్క – ప్రభాస్ ల మధ్య .. ప్రూఫ్ ఇదే !!

- Advertisement -

అనుష్క చాలా సీరియస్ గా నమ్మి చేసిన ప్రాజెక్ట్ సైజ్ జీరో ఈ సినిమా విషయంలో దారుణమైన ఫలితాన్ని చూస్తోంది స్వీటీ. సైజ్ జీరో కోసం చాలా కష్టపడిన అనుష్క భారీ ప్లాప్ ని మూటగట్టుకుంది. సైజ్ పెరిగి చక్కటి శరీర ఆకృతి ని కోల్పోయి మరీ బండగా తయారయి ఏ హీరోయిన్ కూడా ఇంత రిక్స్ చేసి ఎరగదు.

కానీ అనుష్క తన పర్ఫెక్షన్ ని చూపిస్తూ ఈ సినిమా కథ కోసం సాగింది. సరే ఇప్పుడు తదుపరి చిత్రాలు బాహుబలి 2 సింగం 3 ల షూటింగ్ కి సిద్దం అవుతోంది స్వీటీ. అనుష్క కి ఇలా ఒకే సమయంలో రెండు ప్రాజెక్ట్ లు హ్యాండిల్ చెయ్యడం చాలా తేలికైన పనే. ఈ సినిమా తరవాత ప్రభాస్ బ్యానర్ లో సినిమా కి ఓకే చెప్పింది అంటున్నారు.

ప్రభాస్ బ్యానర్ ఎప్పుడు పెట్టాడు నిర్మాత ఎప్పుడు అయ్యాడు అనుకుంటున్నారా? అబ్బే కాదండీ ప్రభాస్ బ్యానర్ అంటే ప్రభాస్ కి ఫ్రెండ్స్ అయిన ప్రమోద్ – వంశీ ల బ్యానర్ యూవీ క్రియేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ సినిమాకి రీసెంట్ గా సంతకం పెట్టింది స్వీటీ.ప్రమోద్ – వంశీలు నిర్మించే ఓ ప్రాజెక్ట్ కు స్వీటీ శెట్టి ఓకే చెప్పిందని తెలుస్తోంది.

ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పగా.. తనకు బాగా నచ్చిందని చెప్పిందని అంటున్నారు. రెమ్యూనరేషన్ డేట్స్ లాంటి మిగిలిన టాక్స్ నడుస్తున్నాయట. ప్రభాస్ మీద అభిమానంతోనే హీరో ఇంకా ఓకే అవ్వకుండా స్వీటీ సంతకం పెట్టింది అని ఇద్దరి మధ్యనా స్నేహానికి ఇదే నిరూపణ అంటున్నారు విశ్లేషకులు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -