Friday, May 10, 2024
- Advertisement -

నిరాశలో డార్లింగ్ ఫ్యాన్స్.. ప్రభాస్ కే ఎందుకిలా ?

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి తరువాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఏర్పడడంతో నేషనల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి ఇచ్చిన ఇంపాక్ట్ తో హిందీ లోనూ స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రభాస్ ఇంపాక్ట్ బాలీవుడ్ లో ఎంతలా ఉందంటే అక్కడి స్టార్ హీరోలకు సైతం ఏమాత్రం తీసిపోని క్రేజ్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. దానికి ఉదాహరణగా సాహో మూవీని చెప్పుకోవచ్చు. తెలుగులో ఫ్లాప్ గా నిలిచిన ఈ మూవీ హిందీలో మాత్రం అదిరిపోయే వసూళ్లు అందుకుంది. ఇక అలాగే తెలుగులో డిజాస్టర్ అయిన రాధే శ్యామ్ హిందీలో కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ను రాబట్టింది. దీన్ని బట్టే ప్రభాస్ క్రేజ్ అక్కడ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ మద్య కాలంలో ప్రభాస్ టైమ్ ఏమాత్రం బాగోలేదనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ కు తగినట్టుగా ఒక్క హిట్ మూవీ కూడా లేకపోవడం గమనార్హం. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సాహో, రాధేశ్యామ్ మూవీస్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక ఆ తరువాత అందరి చూపు ప్రభాస్ ఆది పురుష్ పై పడింది. ఈ మూవీతో తమ అభిమాన హీరో ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ టీజర్ పై దారుణమైన విమర్శలు వెల్లువెత్తాయి.

పూర్ గ్రాఫిక్స్ అంటూ ఆది పురుష్ పై కామన్ ఆడియన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ పెదవి విరిచారు. దాంతో ఈ మూవీలోని విజువల్ ఎఫెక్ట్ పై మరింత దృష్టి పెట్టేందుకు మూవీని మరోసారి వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ సంక్రాంతికి ఆది పురుష్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మూవీపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తప్పక వాయిదా వెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మూవీ ని వచ్చే ఏడాది జూన్ 16 కు వాయిదా వేస్తున్నట్లు చిత్రాయునిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి నిరాశకు గురౌతున్నారు. మరి ప్రభాస్ రేంజ్ కు తగిన హిట్ ఏ మూవీ ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

సుకుమార్ తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్.. హీరో ఎవరో మరి !

విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలే.. రెండు భారీ ప్రాజెక్టులు !

అవతార్ 2 రిలీజ్ డేట్ పై కన్నేసిన అల్లు అర్జున్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -