పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ అయ్యింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం తెరకెక్కుతుంది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘డార్లింగ్’ చిత్రాల తర్వాత ప్రభాస్ లవర్ బోయ్గా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్.
టీజర్ లో నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని పూజా ప్రశ్నించగా.. ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ‘రాధేశ్యామ్’ చిత్రం. ఈ టీజర్ లో లోకేషన్ చూస్తుంటే చాలా రిచ్ గా కనిపిస్తుంది.
ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తున్నారు. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అలనాటి నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీ శర్మ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
మాజీ సీఎం మనువడితో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!