‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ సినిమాలో మహాలక్ష్మిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది పంజాబీ భామ మెహరీన్ పిర్జాదా. ఆమె నటించిన ఈ తొలి సినిమా విడుదలై నిన్నటికి సరిగ్గా ఐదేళ్లు. దీంతో మెహరీన్ అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి సంతోషం, కాస్త బాధ కలిగించే వార్త ఒకటి ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతోంది. మెహరీన్ త్వరలోనే వెండితెరకు గుడ్ బై చెప్పబోతోందట.
అవును.. పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు ఈ బొద్దుగుమ్మ సిద్ధమవుతోందట. అది కూడా ఆషామాషీ వ్యక్తిని కాదు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి మనువడిని ఆమె మనువాడబోతోందట. హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్తో ఆమె వివాహం జరుగుతుందట. ఇప్పటికే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందట.
మార్చి 13న పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాటు చేస్తున్నాయట. జోధ్పూర్లోని ఓ కోటలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. భవ్య ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు. భవ్య కూడా రాజకీయ నాయకుడే. ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఇక పెళ్లి తర్వాత మెహరీన్ సినిమాలకు దూరం కానుందట. ఇక మెహరీన్ ఎఫ్2లో హనీగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ఎఫ్3లో నటిస్తోంది.
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మహానటి !
మేలో మెగా మేనల్లుడు సాయి తేజ్ పెళ్లి!