Saturday, May 4, 2024
- Advertisement -

బన్నీ ‘డార్లింగ్’ రుణం తీర్చుకోనున్న ప్రభాస్…… అందుకు రెడీ

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోల మధ్య ఇప్పుడు చాలా పెద్ద మార్పే వచ్చింది. గొడవలు పడితే కలెక్షన్స్ నష్టపోవడం తప్ప వేరే ఏ ఉపయోగం లేదని రియలైజ్ అయిన హీరోలు…. అందరు హీరోల సినిమాలను అందరు హీరోల అభిమానులు చూసేలా చేయడం కోసం స్పెషల్‌గా ప్లాన్స్ వేస్తున్నారు. అంతా కూడా భారీ బడ్జెట్స్, అంతకుమించిన భారీ రెమ్యూనరేషన్స్ మహిమ.

రీసెంట్‌గానే భరత్ అను నేను సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి వెళ్ళి మహేష్‌ని విష్ చేశాడు ఎన్టీఆర్. ఇప్పుడిక డార్లింగ్ ప్రభాస్ కూడా బన్నీ సినిమా నా పేరు సూర్య ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి ఛీఫ్ గెస్ట్‌గా రానున్నాడు. గతంలో ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాకు చీఫ్ గెస్ట్‌గా బన్నీ వచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ ఆ రుణం తీర్చుకోనున్నాడు. నా పేరు సూర్య సినిమా కోసం బన్నీ స్థాయికి మించి ఖర్చుపెట్టారు. అందుకే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్‌, క్రేజ్‌ని పీక్స్ తీసుకెళ్ళేదిశగా అల్లు అర్జున్ వ్యూహం రచిస్తున్నాడు. అందుకే బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్‌ని తన సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించాడు బన్నీ. బన్నీతో ఎఫ్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రభాస్ కూడా వెంటనే ఒకే అనేశాడు. హీరోలందరూ కూడా పరస్పర లాభాల కోసం ఇప్పుడు స్నేహధర్మాన్ని పాటిస్తున్నారు. ఇక అభిమానుల్లో కూడా మార్పు వస్తే సినిమా గొడవలు చాలా వరకూ తగ్గుతాయనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -