అనుపమ పరమేశ్వరన్ అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన సంగతి తెలిసిందే.ఆ తరువాత తెలుగులో చాలా సినిమాలు చేసింది.ముఖ్యంగా కుర్ర హీరోలకు ఫేవరెట్ హీరోయిన్గా మారింది.అలాంటి అనుపమ నిర్మాతలను ఇబ్బంది పెడుతుందని వార్తలు వస్తున్నాయి.అనుపమ ప్రస్తుతం ‘తేజ్ ఐ లవ్ యు’,’హలో గురు ప్రేమకోసమే’ వంటి చిత్రాల్లో నటిస్తోన్న ఈ భామ నిర్మాతలను ఇబ్బంది పెడుతోందని టాక్. రామ్ తో కలిసి నటిస్తోన్న ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాను నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు.
అనుపమ తనకంటూ స్పెషల్ గా ఒక క్యారవాన్ ఇవ్వమని నిర్మాతలను అడిగిందట. సాధారణంగా సింగిల్ డోర్ క్యారవాన్ ను హీరోలకు మాత్రమే కేటాయిస్తారు. యూనిట్ వాళ్లు ఇచ్చే కాస్ట్యూమర్ వద్దని.. తన పెర్సనల్ కాస్ట్యూమర్ కావాలని పట్టుబట్టిందట.కెరీర్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సమయంలో అనుపమ ఇలా తన ప్రవర్తనతో ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.