- Advertisement -
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్ట్ మహనాయకుడు ఈరోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను స్టార్ దర్శకుడు పూరిజగన్నాథ్ కూడా మహనాయకుడు సినిమాను వీక్షించారు. సినిమా చూసి బయటికి వచ్చిన పూరి మహనాయకుడు తనకు బాగా నచ్చిందని తెలిపారు. బపవతారకంగారి గురించి బాలయ్య చెప్పే డైలాగ్ ,అసెంబ్లీలో ఎన్టీఆర్ కు జరిగిన సన్నివేశం చూసి ఏడ్చానని పూరి చెప్పారు.
ఇటీవల కాలంలో తాను ఏడ్చిన సందర్భం ఇదేనని ఆయన మీడియాతో తెలిపారు. మహనాయకుడు సినిమాలో బాలయ్య నటన అద్భుతంగా ఉందని,ఆయన సినిమాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పారు. నాన్నగారి మీద అభిమానంతో ఎంతో ఇష్టంగా నటించారని పూరి చెప్పుకొచ్చారు.బాలయ్యతో పైసా వసూల్ సినిమాను తీశాడు పూరి.ఈ సినిమాను బాలయ్యతో కలసి పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు.