Thursday, May 2, 2024
- Advertisement -

పూరీ మొదటి కల నెరవేర్చిన చిరంజీవి

- Advertisement -

నటుడిగా తనను తాను నిరూపించుకోవాలన్నది అతడి కల. చిన్న చిన్న వేషాలు వేశాడు. అయితే నటుడిగా నిరూపించుకోవాలన్న కల తీరకుండానే..అతడి దారి మారిపోయింది. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అతడెవరో కాదు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ .. ఆయన కల తీర్చేందుకు మెగా స్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. మోహన్ రాజా దర్శకుడిగా మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళ హిట్‌ మూవీ ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా వస్తోంది. చిరు 153వ చిత్రం ఇది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు పూరీ జగన్నాథ్. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు వెండితెరపై నటుడిగా ఓ వెలుగువెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది.. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే గాడ్‌ ఫాదర్‌ సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తున్నాడు’ అని చిరు ట్వీట్ చేశారు. పూరీకి పుష్పగుచ్చాలు అందిస్తూ ఉన్న ఫోటోను కూడా చిరంజీవి షేర్ చేశారు. ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో పూరి జగన్నాథ్‌ ఓ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

ఒక వైపు దర్శకత్వం చేస్తూనే పూరి జగన్నాథ్.. వెండి తెరపై మీద తళుక్కున మెరుస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఏ మాయ చేసావే, ఎన్.టి.ఆర్ హీరోగా ఆయన దర్శత్వంలో వచ్చిన టెంపర్, రామ్ పోతినేనితో తీసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రాలలో తెరపై కొంతసేపు కనిపించారు. అయితే గాడ్ ఫాదర్‌లో పూర్తి స్థాయి నిడివి ఉన్న కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

ట్రిపుల్ఆర్ కు రాజమౌళి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..?

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -