Saturday, May 18, 2024
- Advertisement -

చిరంజీవి పరువు తీసేస్తున్న పూరీ జగన్నాథ్!

- Advertisement -

ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ మెగాస్టార్ పరువు తీస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మీడియా మెగాస్టార్ తో సినిమా గురించి వివరాలు ఆసక్తికరంగా అడిగింది.

అయితే ఈ సందర్భంలో పూరీ స్పందించిన తీరు మెగా ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టేలా ఉంది. ఇంతకీ పూరీ ఏమంటున్నాడంటే… తను చెప్పిన కథను విని మొదట చిరంజీవి మెచ్చుకున్నాడని.. తొలి సగం విన్నాకా నచ్చిందని చెప్పాడని… తీరా రెండో సగం విన్నాకా తర్వాత కబురు చేస్తానని తనను పంపించేశాడని పూరీ అన్నాడు. రెండో సగం రిజల్ట్ గురించి తనతో కాక చిరంజీవి మీడియాతో చెప్పాలని పూరీ అన్నాడు. సెకెండాఫ్ నచ్చకపోవడంతో పూరీ తో సినిమాను క్యాన్సిల్ చేశానని మెగా స్టార్ వ్యాఖ్యానించాడని పూరీ వివరించాడు.

మరి అదే మాటే తనకు చెప్పి.. సెకెండాఫ్ లో ఏవైనా మార్పులు చేయమని చెప్పి ఉంటే.. తనే చేసే వాడనని… పూరీ చెప్పుకురావడమే ఇక్కడ అసలైన విశేషం. చిరంజీవి తను చెప్పిన కథ విని.. సరిగా స్పందించలేదని.. తనతో కాకుండా మీడియాతో మాట్లాడి తనను నిరాశపరిచాడని పూరీ చెప్పినట్టుగా అవుతోంది. దీంతో మెగాస్టార్ ను అనవసరంగా ఒక వివాదంలోకి లాగినట్టు అవుతోంది. పూరీ వెర్షన్ వింటున్న వాళ్లుకూడా… మెగాస్టార్ తీరు సరికాదేమో అంటున్నారు. మెగా స్టార్ ఆ కథ గురించి పూరీతోనే డైరెక్ట్ గా మాట్లాడాల్సింది కానీ… చిరంజీవి మీడియాతో మాట్లాడటం ఏమిటనే… అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. ఈ అభిప్రాయాలు కలగడానికి కారణం పూరీ ఇచ్చిన ఇంటర్వ్యే. ఈ ఇంటర్వ్యూలో చిరు గురించి పూరీ వ్యక్తపరిచిన అభిప్రాయాలు.. చిరంజీవి ని ఇబ్బంది పెట్టే విలా ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -