Friday, May 24, 2024
- Advertisement -

పూరీ జగన్నాథ్.. మెగాభిమానులను శాంతింపజేసే యత్నం!

- Advertisement -

మొన్నామధ్య తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యానాలు వివాదాస్పదం అయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి తీరును తప్పుపడుతున్నట్టుగా…పూరీ మాట్లాడాడు. చిరంజీవి 150 వ సినిమాకు తను కథ రాశానని.. అందులో తొలి సగాన్ని విన్న చిరంజీవి మెచ్చుకున్నాడని, బాగా ఉందన్నాడని.. అయితే ద్వితీయార్థం విన్నాకా మాత్రం ఏం మాట్లాడలేదని పూరీ వివరించాడు. అంతేగాక ద్వితీయార్థం విన్న తర్వాత రిజల్ట్ ను తనకు గాక.. మీడియాకు చెప్పాడని.. అది కూడా నచ్చలేదని చెప్పాడని.. అదే మాటే తనకు చెప్పి ఉంటే… కథలో మార్పులు చేసి చూపించగలిగే వాళ్లనని.. చిరంజీవిని మెప్పించడానికి ప్రయత్నించే వాడిని అని పూరీ వివరించాడు. 

అయితే తమ అభిమాన హీరో మీద పూరీ ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం పట్ల మెగా భిమానులుఅగ్గిమీద గుగ్గిలమైపోయారు. పూరీ తీరును తీవ్రంగా ఖండించారు. మెగాస్టార్ విషయంలో అనుచిత వ్యాఖ్యానాలు సరికాదని.. అంటూ పూరీ తీరుపై విరుచుకుపడ్డారు. మరి ఇప్పుడు  ఆగ్రహం పూరీ వరకూ వెళ్లిందో ఏమో కానీ.. ఆయన తన తీరులో మార్పు చూపుతున్నాడు. చిరంజీవి కోసం మళ్లీ కథ రాస్తానని చెప్పుకొచ్చాడు. వీలైతే 150 సినిమా లేకపోతే.. 151, లేదా 152 వ సినిమాకైనా తను కథ రాయడానికి సిద్ధంగా ఉన్నానని పూరీ చెప్పుకొచ్చాడు. ఈ విధంగా మెగాస్టార్ పై తన విధేయతను చాటుకున్నాడు. ఇదంతా అభిమానులను కూల్ చేస్తూ.. తనపై వారికున్న ఆగ్రహాలను తగ్గించే యత్నమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -