పుష్ప ది రైజ్.. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై దుమ్మురేపింది. జాతీయ అంతర్జాతీయ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ సినిమాకు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారంటే పుష్ప మ్యానియా ఏంటో అర్థమవుతుంది.
కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. తాజాగా ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 365 కోట్లు వసూలు చేసిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. హిందీలోనే వంద కోట్లు వసూలు చేసింది. అల్లు అర్జున్ కు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ తెచ్చిన మూవీగా నిలిచింది.
రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పుష్ప సినిమాను నిర్మించాయి.
మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్