సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లోనే మైలు రాయిగా నిలిచిన చిత్రం అల్లూరి సీతారామరాజు. 1970 మే 1న విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రజల హృదయాలను హత్తుకున్న ఈ మన్యం వీరుడి కథ మళ్లీ రీమేక్ కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ‘అల్లూరి సీతారామరాజు’ రీమేక్లో మహేశ్ బాబు నటించబోతున్నారన్న ప్రచారం ఫిలిం సర్కిల్స్లో జరుగుతోంది.
ఈ సినిమా తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాలలో మహేశ్ కూడా చెప్పుకొచ్చారు. తన తండ్రికి ఎంతో గొప్ప పేరు తెచ్చిన సినిమా ఇది అని చాలా ఇంటర్వ్యూలలో తెలిపారు. అలాంటి క్లాసిక్ను మహేశ్ రీమేక్ చేయనున్నారని ..టైటిల్ పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా రేంజ్లో అల్లూరి సీతారామ రాజు చిత్రం రీమేక్ చేయాలని భావిస్తున్నారట. బాహుబలి తర్వాత.. టాలీవుడ్ హీరో అంతా పాన్ ఇండియన్ సినిమాలనే చేసేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ తదితరులు ప్రభాస్ రూట్లోనే పాన్ ఇండియన్ కథలపై దృష్టి పెట్టారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు పాన్ ఇండియన్ సినిమాగా ‘అల్లూరి సీతారామరాజు’ రీమేక్ చిత్రంలో చేయాలని భావిస్తున్నారట. అయితే అల్లూరి సీతారామరాజు రీమేక్పై వస్తున్న వార్తలు ఎంత వరకు నిజమో తెలీదు. ‘అల్లూరి సీతారామరాజు’ మాత్రమే కాదు తండ్రి కృష్ణ నటించగా అద్భుతమైన విజయాలను అందుకున్న కొన్ని క్లాసిక్స్ను అస్సలు ముట్టుకోకూడదని మహేశ్ అభిప్రాయపడిన సందర్భమూ ఉంది. అలాంటప్పుడు ఆ చిత్రం రీమేక్కు మహేశ్ అంగీకరిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి వస్తున్న వార్తలపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. మహేశ్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో త్రివిక్రం శ్రీనివాస్తో చేయబోతున్న కొత్త చిత్రం మొదలవ్వాల్సి ఉంది. దీని తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది.
తెరపై రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ మాజీ భార్య