బాలకృష్ణ కథానాయకుడిగా 102 వ సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా నయనతార నటిస్తుండగా, మరో కథానాయిక పాత్రను నటాషా దోషి పోషిస్తోంది. ఈసనిమాపై భారీగానె అంచనాలున్నాయి.
బాలయ్య- కేఎస్ రవికుమార్ ల కాంబోపైనే మొదటగా అందరి కళ్లూ ఉండగా.. ఇప్పుడీ చిత్రం కోసం సెలెక్ట్ చేస్తున్న హీరోయిన్స్ కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నారు. బాలయ్యతో బ్లాక్ బస్టర్ జోడీ అయిన నయనతార లీడ్ హీరోయిన్ రోల్ పోషిస్తుండగా.. ఇప్పటికే మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేశారు. మలయాళీ హీరోయిన్ నటాషా దోషీ మరో హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా… చిత్రంలో మరో మరో కీలక పాత్ర ఉందంట.
ఈ నేపథ్యంలో మరో హీరోయిన్ పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్ ను సంప్రదించారట. కారణమేంటో తెలియదు గానీ .. ఆమె ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందనే టాక్ వచ్చింది.
ఇక రెజీనాను సంప్రదించగా ఆమె కూడా పెద్దగా ఆసక్తిని చూపలేదనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత మనసు మార్చుకుందో ఏమో గానీ, ఈ సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది తాజా సమాచారం. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రెజీనాకు, ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.