ఆడవాళ్లు అందానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అందులోనూ నటీమణుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరింత అందంగా కనిపించడానికి ఫేషియల్స్ అని, సర్జరీలు చేయించుకోవడం కామన్ అయ్యింది. ఈ క్రమంలో ముఖం మీద చిన్న గీత, మచ్చలు పడి ఇబ్బందులు పడ్డవారు కూడా ఉన్నారు. తాజాగా ఓ నటి తన అందానికి మెరుగులు పెట్టించబోయి.. అందవికారంగా మారిన సంఘటన జరిగింది.
‘వెలయ్యిలా పట్టధారి 2’ సినిమాలోని ఓ చిన్నపాత్రతో సినిమా పరిశ్రమకు పరిచయమైంది. అనంతరం తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లోనూ పాల్గొంది. ‘ప్యార్ ప్రేమ కాదల్’ సినిమాతో హీరోయిన్గా మారింది. దీనికిగానూ ఫిల్మ్ఫేర్ అవార్డును సైతం అందుకుంది.
ఈ బ్యూటీ ‘అలైస్’, ‘కాదలిక్క యారుమిల్లై’, ‘హ్యాష్ట్యాగ్ లవ్’ అనే సినిమాలు చేస్తోంది. సినిమాల్లో బిజీ కావడంతో తన అందాన్ని ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ.. ఫేషియల్ కోసమని బ్యూటీషియన్ భైరవి సెంథిల్ దగ్గరకు వెళ్లింది. తన ముఖంలో మరింత గ్లో పెరగాలని డాక్టర్ ఏవేవో చర్మ చికిత్సలు చేయడంతో.. ఫైనల్గా అది వికటించి నటి కన్ను కింద వాచిపోయింది. దీని గురించి నిలదీద్దాం అంటే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోంది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారు అంటూ ఓ ఫొటోను ఇన్స్టా స్టోరీలో యాడ్ చేసింది.
నేటి పంచాంగం,సోమవారం(19-04-2021)
తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నటుడు నరేష్!