తొలి సినిమాతో వరుసగా మూడు విజయాలు అందుకున్న రాజ్ తరుణ్కు ఇప్పుడు గడ్డుకాలం వచ్చి పడింది. తను నటించిన సినిమాలు వరుసగా పరాజయాలు మూటగట్టుకున్నాయి. ఈసారి సంక్రాంతి బరిలోకి నాగార్జున నిర్మాణంలో వచ్చిన ఫలితం లేదు. అయితే అవేవి పట్టించుకోకుండా రాజ్ తరుణ్ ప్రస్తుతం మరో సినిమా పూర్తి చేయడంలో మునిగాడు.
ప్రస్తుతం రాజ్ తరుణ్ అనీశ్ కృష్ణ దర్శకత్వంలో ‘లవర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అయితే షూటింగ్ సమయంలో దర్శకుడితో కలిసి దిగిన ఫొటో ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. `తన దర్శకుడు తనకు దేవుడిలా కనిపించిన క్షణం` అని ప్రకటించి పోస్ట్ చేశాడు.
నిజంగాంటే దర్శకుడు దేవుడిలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమాతోనైనా విజయం అందుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. ఫ్లాపులతో ఉన్న హీరోకు అవకాశం ఇచ్చాడంటే ఆ దర్శకుడు దేవుడు కిందకే లెక్క.