సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకొని విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్తో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు చరణ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉంటుందన్న విషయం తెలిసిందే. మిర్చి తోపాటు శ్రీమంతుడు,జనతాగ్యారేజ్, భరత్ అనే నేను ఇలా ప్రతి సినిమాలోనూ రాజకీయాలు, సామాజిక పరమైన అంశాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయి.
ఆచార్యలో చిరంజీవి, చరణ్ నక్సలైట్లు గా కనిపిస్తారు. అలాగే దేవదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి గా కూడా చిరంజీవి కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయట. తాజా రాజకీయాలపై కొన్ని పదునైన డైలాగులు ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అవేమిటో చూడాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఆచార్య మూవీ కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ లో కానీ, అక్టోబర్ లో కానీ విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read
ఎవరు మీలో కోటిశ్వరుడు? ఫస్ట్ గెస్ట్ గా ఎవ్వరంటే..?