హీరో రాజశేఖర్, ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో వచ్చిన పి.ఎస్.వి. గరుడవేగ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన అన్ని చోట్లో ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ తో పాటు సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు రాజశేఖర్ హీరోగా మరొకసారి తన సత్తా ఏంటో చూపించారు అంటూ ఆయనను ఆకశానికి ఎత్తాడు.
ఇక సెలబ్రెటీస్ కూడా రాజశేఖర్ కి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాపై తన స్పందనని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముందుగా యూనిట్ సభ్యులకు అభినందనలు చెప్తూ సినిమా సానుకూలమైన స్పందన పొందిందని తెలిపారు. అలానే మూవీ చూసేందుకు ఆదివారం షోకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు.
రాజమౌళి ట్వీట్స్ కి రాజశేఖర్ బలులిస్తూ ‘ధన్యవాదాలు సర్. మీ మాటలు మాకు కొండంత బలాన్ని ఇచ్చాయి’ అని రీ ట్వీట్ చేశారు. నిన్న రిలీజ్ అయిన మూడు సినిమాల్లో గరుడవేగ కి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ మూవీ ఇచ్చిన బూస్ట్ తో రాజశేఖర్ మల్లి ఫాలోకి వచ్చే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.