వర్ధమాన నటి కీర్తీసురేశ్ కు ఇండస్ట్రీలో బిగ్ షాక్ తగిలింది. మహానటిలో సావిత్రిగా కీర్తి నటన ఆమె జీవితంలో కలికితరాయిగా నిలిచిపోయింది. కీర్తీసురేశ్ గురించి రాసినా, మాట్లాడినా మహానటి ప్రస్తావన లేకుండా ఉండదు. అలాంటి కీర్తి సురేష్కు కోలీవుడ్లో సూపర్ చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయ్యిందనే విషయం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రజనీకాంత్ ప్రస్తుతం దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. రజనీకి తోడుగా నయనతార కథానాయకిగా నటిస్తోంది. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా మొదట కీర్తి సురేష్ ను అనుకున్నారంట మురగన్ దాస్. అయితే రజనీకాంత్ మాత్రం హీరోయిన్గా నయనతారను ఎంపిక చేయమని చెప్పడంతో దర్శకుడు మురుగదాస్కు మరో దారి లేక ఆమెనే ఎంపిక చేసినట్లు టాక్ వైరల్ అవుతోంది. కీర్తీసేరేశ్ తనకు జంటగా సెట్ అవ్వదని రజనీకాంత్ చెప్పారట. కోలీవుడ్లో సూపర్ చాన్స్ను కోల్పోయిన కీర్తీసురేశ్కు టాలీవుడ్లో మాత్రం మెగా చాన్స్ లభించినట్లు తెలుస్తోంది. అవును త్వరలో ఈ చిరునవ్వుల చిన్నది చిరంజీవికి జంటగా నటించబోతోందనే ప్రచారం జోరందుకుంది