హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్తో జోడి కట్టనుందని వార్తలు వినబడుతున్నాయి.మహేశ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ త్వరలో మరో భారీ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు మహేశ్.
ప్రస్తుతం సెట్స్మీద ఉన్న మహేష్ 25 పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమా పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. మహేశ్తో రకుల్ అంతకముందు స్పైడర్ సినిమాలో కలిసి నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.