సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ చిట్టిబాబుగా, సమంత రామలక్ష్మిగా ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని మార్చి 30వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ప్రాణం పెట్టి రామ్చరణ్ నటించారని టీజర్, పాటలు చూస్తుంటే తెలిసిపోతోంది.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలెట్టేశారు. ఇటీవల రామ్చరణ్ ఓ ఐటీ కంపెనీకి వెళ్లి సినిమాపై ప్రచార కార్యక్రమాల్లో చిట్టిబాబు అదేనండి రామ్చరణ్ వెళ్లి పాల్గొని సందడి చేశాడు. ‘రంగస్థలం’తో మీ ముందుకు వస్తున్నా. తాను సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి 2018కి పదేళ్లు అని చెప్పారు. ఈ పదేళ్ల కెరీర్లో తాను చేసిన సినిమాల్లో ‘రంగస్థలం’ ఒక ఉత్తమ సినిమాగా చెర్రీ అభివర్ణించారు.
కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం 365 రోజులు కష్టపడ్డానని, ‘రంగస్థలం’ గడ్డాన్ని చాలా మిస్సవుతున్నా అని బాధపడ్డాడు. ‘రంగస్థలం’లో ఆది, అనసూయ, జగపతిబాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు సంగీతం ఇటీవల విడుదలైన పాటలు సూపర్గా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక మార్చి 18వ తేదీన విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి వెళ్లనున్నారు.
ఈ సినిమా తర్వాత రామ్చరణ్ బోయపాటి శీను దర్శకత్వంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి రామ్చరణ్ సినిమా చేయనున్నాడు.