Sunday, May 19, 2024
- Advertisement -

బోయపాటితో చ‌ర‌ణ్‌ సినిమా ప్రారంభం

- Advertisement -

మూడు బాధ్య‌త‌లు ఎలా చెర్రీ…. బోయపాటితో చ‌ర‌ణ్‌ సినిమా ప్రారంభం…. ఈపాటికే రంగ‌స్థ‌లం, సైరా సినిమాల‌తో బిజీ

ఇప్ప‌టికే రెండు సినిమాల‌తో తీరిక లేకుండా గ‌డుపుతున్న రామ్‌చ‌ర‌ణ్ తేజ్ అత‌డు మ‌రో సినిమాను పైకెత్తుకున్నాడు. తాను న‌టిస్తున్న రంగ‌స్థ‌లం సినిమా చేస్తూనే త‌న తండ్రి సినిమా సైరా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాను భారీ అంచ‌నాల‌తో, భారీ వ్య‌యంతో నిర్మిస్తున్నాడు. త‌న సినిమా క‌న్నా తండ్రి సినిమాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాడు. ఈ సినిమాలో భారీ తారాగ‌ణంతో చేస్తున్నారు. ఆ ప‌నుల్లో బిజీగా ఉండ‌గా ఇప్పుడు తాను హీరోగా ఓ సినిమాను ఓకే చెప్పి చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించేశాడు.

దిగ్గజ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా ప్రారంభ ప‌నులు శుక్రవారం ప్రారంభ‌మ‌య్యాయి. హైద‌రాబాద్‌లోని కొణిదెల ప్రొడక్షన్‌ కార్యాలయంలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్నిడీవీవీ దానయ్య నిర్మించనున్నారు. 2018 జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’లో నటిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు పూర్త‌య్యింది. ఇత‌డి స‌ర‌స‌న సమంత నటిస్తోంది. 2018 మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క రామ్‌చరణ్‌.. రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్‌ చిత్రంలోనూ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా బ‌రువును రామ్‌చ‌ర‌ణ్ మోస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -