Sunday, May 5, 2024
- Advertisement -

మ‌రో బిజినెస్‌లోకి రామ్‌చ‌ర‌ణ్‌

- Advertisement -

ఇప్ప‌టికే ప‌లు రంగాల్లో బిజినెస్ చేస్తున్న మెగా న‌టుడు రామ్‌చ‌ర‌ణ్ తేజ్ మ‌రో బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నాడ‌ట‌. వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే ఉంటూ మ‌రో ప‌క్క బిజినెస్‌ను విజ‌య‌వంతంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు థియేట‌ర్ రంగంలోకి వ‌స్తాడంట‌. దీనిపై ఈపాటికే ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

రంగ‌స్థ‌లం నిర్మాతల బ్యాన‌ర్‌ యూవీ క్రియేషన్స్. వీరితో క‌లిసి చరణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్స్ బిజినెస్‌ను మొదలెట్టనున్నారట. త్వరలో అధికార ప్ర‌క‌ట‌న వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రంగస్థలం సినిమాను దాదాపు రూ.18 కోట్లకు నైజాం హక్కులను యూవీ క్రియేషన్స్ కొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 30వ తేదీన థియేటర్లలోకి రానుంది.

ప్ర‌స్తుతం నిర్మాతగా, న‌టుడిగా బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తీస్తున్న రంగ‌స్థ‌లం సినిమా పూర్త‌య్యి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. నిర్మాత‌గా అవతారమెట్టి కొణిదెల ప్రొడక్షన్స్‌ను మొదలెట్టి త‌న మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నంబర్- 150 సినిమా తీసి మంచి విజ‌యం అందుకున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ తండ్రితో సైరా నరసింహారెడ్డి సినిమా తీస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -