Monday, May 6, 2024
- Advertisement -

అదే పాత్రలో నిన్న సాయి ధరమ్ తేజ్.. నేడు రామ్ చరణ్

- Advertisement -

దాదాపు రెండేళ్లుగా జక్కన్న దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ ఆర్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆతర్వాత వెంటనే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ’ఆచార్య’ లోనూ కీలకపాత్రలో నటించారు. ఇటీవలే ఆచార్య షూటింగ్ పూర్తయింది. ఈ రెండు సినిమాలు చాలా తక్కువ వ్యవధిలో ఒకదాని వెంట మరొకటి విడుదల అవనున్నాయి.

ఆ తర్వాత విశ్రాంతి లేదంటున్నాడు చరణ్. వెంటనే శంకర్ దర్శకత్వంలో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మెగా హీరో . ఈ చిత్రాన్ని సైతం వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు . ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లలో పోరాట సన్ని వేశాలను షూట్ చేయనున్నారు. అనంతరం పంజాబ్ లోనూ చిత్రీకరణ చేయనున్నారు. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చరణ్ ఒక ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన రిపబ్లిక్ సినిమాలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఐఏఎస్ అధికారి పాత్రలో నటించారు. కాగా ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నది.

అలియా మ‌న‌సులో ఉన్న ఆ హీరో ఎవ‌రు ?

భారీ ధ‌ర ప‌లికిన రాధేశ్యామ్ డిజిట‌ల్ శాటిలైట్ హ‌క్కులు

నాగ‌శౌర్య కు కౌంటర్ ఇచ్చిన సాయి పల్లవి,.. ఎందుకు..?

పుష్ప లెక్క‌లు బ‌య‌ట‌పెట్టిన నిర్మాత‌లు

మాఫియా క్వీన్ గా బాలీవుడ్ చిన్న‌ది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -