బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అతడితో కోట్లు ఖర్చుపెట్టి మరీ సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూకడుతున్నారు. ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు నమోదు చేస్తుండటంతో..బడ్జెట్ ఎంతైనా పెట్టడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. దీనికి తగ్గట్టు ప్రభాస్ కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన ఒప్పుకున్న సినిమాలకు 2000 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనా.
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూవీ సంస్థ నిర్మిస్తున్న రాధేశ్యామ్ చిత్రానికి దాదాపు 350కోట్ల వరకు బడ్జెట్ అయిందట. అయితే తాజాగా ఈ చిత్రానికి డిజిటల్ శాటిలైట్ హక్కులు అన్ని భాషలు కలుపుకొని రూ. 250కోట్ల భారీ ధరకు డీల్ కుదిరిందని సమాచారం.
దీన్నిబట్టి చూస్తే నిర్మాతలకు ఇప్పటికే 70 శాతం వరకు తిరిగి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ షూటింగ్ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. సలార్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.