Wednesday, May 1, 2024
- Advertisement -

మంచి సినిమాను ఇవ్వ‌లేక‌పోయాను క్ష‌మించండి – రామ్ చ‌ర‌ణ్

- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా న‌టించిన చిత్రం విన‌య విధేయ రామ‌. రంగ‌స్థలం వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పైగా ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో విన‌య విధేయ రామ‌పై అంచ‌నాలు మరింత పెరిగాయి. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ న‌టించిన ఈ సినిమా సంక్రాంతికి విడుద‌లైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా భారీ డిజాస్టార్‌గా నిలిచింది. రామ్ చ‌ర‌ణ్ అభిమానులు సైతం ఈ సినిమాపై పెద‌వి విరిచారు. తాజాగా ఈ సినిమా ఫ్లాప్‌పై స్పందించాడు రామ్ చ‌ర‌ణ్ తేజ్‌.

ఈ సినిమా ఫ‌లితంపై రామ్ చ‌ర‌ణ్ స్పందిస్తు ఓ ప్రెస్ నోట్‌ను విడుద‌ల చేశాడు. ప్రియమైన అభిమానులకు , ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించి పనిచేసిన సాంకేతిక నిపుణులకు,పంపిణీ దారులకు, ప్రదర్శన దారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వినయ విధేయ రామ సినిమాతో మీ అంద‌రిని అల‌రిస్తాన‌ని భావించాను. కాని దురదృష్టవశాత్తు మీకు మంచి సినిమాను అందించలేక పోయాము. ఈ సినిమా కోసం అంద‌రం చాలా క‌ష్ట‌ప‌డ్డాము. భవిష్యత్తులో మీకు నచ్చే,మీరు మెచ్చే సినిమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటున్నాను.

అన్నివేళలా తమ మద్దతును అందించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు అంటూ ఓ ప్రెస్ నోట్‌ను విడుద‌ల చేశాడు రామ్ చ‌ర‌ణ్‌. దీనిపై రామ్ చ‌ర‌ణ్ అభిమానులు మా హీరోలా ఎవ‌రు చేయ‌లేరంటు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. నా సినిమా ఫ్లాప్ అయింద‌ని చెప్పే హీరోలు ఎవ‌రు లేర‌ని, అలా చేసిన మొట్ట మొద‌టి హీరో రామ్ చ‌ర‌ణే అంటున్నారు చెర్రీ అభిమానులు. ప్ర‌స్తుతనికి అయితే రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

https://www.youtube.com/watch?v=czXGVhJDyFc

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -