Friday, May 17, 2024
- Advertisement -

క్రికెటర్ రైనా పాత్ర చేయబోతున్న రామ్ చరణ్..!

- Advertisement -

భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్ లో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కూడా స్థానం దక్కినట్టుగా తెలుస్తోంది.

నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చెర్రీకి ఒక పాత్ర దొరికినట్టు సమాచారం. ధోనీ క్రికెట్ సహచరుడు.. టీమిండియన్ ప్లేయర్ సురేష్ రైనా పాత్రలో చరణ్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ధోనీ బయోపిక్ లో ఇతర క్రికెటర్ల ప్రస్తావన ఉండటం సహజమే. అందులో భాగంగా యువరాజ్ , రైనా వంటి పాత్రలు కూడా తెరపైకనిపించబోతున్నాయి. ఈ నేపథ్యంలో లెఫ్టెండర్ రైనా పాత్రకు చెర్రీని ఎంచుకొన్నాడట దర్శకుడు నీరజ్ పాండే.

ఇది వరకూ చరణ్ బాలీవుడ్ సినిమాలో నటించిన విషయం తెలసిందే. జంజీర్ సినిమాతో చరణ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా చరణ్ తెలుగులో నటించిన అనేక సినిమాలు హిందీలోకి డబ్ అయ్యాయి. ఈ విధంగా రామ్ చరణ్ బాలీవుడ్ కు టచ్ లోనే ఉన్నాడు. దీని ఫలితంగా ధోనీ బయోపిక్ లో రైనా పాత్ర దక్కింది. మరి ఇది అభిమానులను బాగా ఆకట్టుకొనే అంశమే అని చెప్పవచ్చు. ఇంకా ఈ సినిమాలో అనేక మంది బాలీవుడ్ నటులు కనిపించబోతున్నారు. ధోనీ పాత్రను సుషాంత్ సింగ్ రాజ్ పుత్ చేయబోతుండగా.. జాన్ అబ్రహం యువరాజ్ సింగ్ పాత్రలో కనిపించబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -