Thursday, March 28, 2024
- Advertisement -

2022 లో ఒక్కరు కూడా మిగలరు… ఆర్జీవి షాకింగ్ కామెంట్స్

- Advertisement -

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ సంచలన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్లకు తెరతీస్తున్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఈ కరోనా మహమ్మారిని క్యాష్ చేసుకోవడంలో ముందున్నట్టున్నాడు. వర్మ తాజా పరిణామాలపైన, వివాదాస్పద ఘటనల పైన సినిమాలు చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు.

రాంగోపాల్ వర్మ ఒకే ఏడాదిలో పవర్ స్టార్ దగ్గర నుంచి కరోనా వరకూ సినిమాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. వర్మ ఈ మధ్య తన రూటుమార్చి కొంతకాలంగా దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులపై ట్వీట్ చేయడం ప్రారంభించారు.కుంభమేళకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడాన్ని ఆయన తప్పుబడుతూ ఈసారి వైరస్ వ్యాప్తికి కుంభమేళనే కారణం అవుతుందని పరోక్షంగా కామెంట్ చేశాడు.

Also read:టాలీవుడ్ 100 కోట్ల సినిమా.. అక్కడ మాత్రం అట్టర్ ప్లాప్!

రాంగోపాల్ వర్మ ప్రతీ విషయాన్నీ వ్యంగ్యంగా చెప్పడం కొత్త కాదు. తాజాగావచ్చే ఏడాదికి ఇక మనుషులే మిగలరు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ అమ్మాయి ఫోటోని వర్మ ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో అమ్మాయి టీషర్టుపై ‘2019లో నెగెటివ్ మనుషులని దూరం పెట్టాము. 2020లో పాజిటివ్ వ్యక్తులను దూరం పెట్టాము. 2021లో మనుషులనే దూరం పెట్టాల్సి వచ్చింది’ ని రాసి ఉంది. ఈ ఫోటోని షేర్ చేసిన వర్మ అసలు 2022లో మనుషులే ఉండకపోవచ్చు అంటూ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ప్రతి విషయాన్ని విభిన్నమైన కోణంలో తనకు ఏం తోచిందో అదే నెట్టింట్లో పెట్టటం రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకం.

Also read:అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మరో బ్యూటీకి అవకాశం.. కథ అంత ఆమె చుట్టే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -