రామ్ చరణ్ ప్రస్తతం సుకుమర్ డైరక్షన్లో రంగస్థలం అనే సినిమా చేస్తున్నాడు.తర్వాత ఎవ్వరితో పని చేస్తాడు అంటే లైన్లో రాజమౌళి ,బోయపాటి శ్రీనుతో ఒక సినిమాలు ఉన్నాయి.కాని రాంచరణ్ ఆలోచన మరోలా ఉంది.“అర్జున్ రెడ్డి” సినిమాతో తనవైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి .ఒక్క సినిమాతో ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తదుపరి చిత్ర హీరోగా ఇప్పటికే శర్వానంద్ ను ఫైనల్ చేసుకున్న సందీప్ జాబితాలో ఇంకెవరూ ఉన్నారా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
తాజాగా రామ్ చరణ్ తో దిగిన ఓ ఫోటో కొత్త ఊహాగానాలకు తెరతీసింది. చరణ్ , సందీప్ రెడ్డి ,శర్వానంద్ ,యూవీ క్రియేషన్స్ పార్ట్నర్ విక్కీ కలిసి ఫోటో దిగారు.దీంతో రామ్ చరణ్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ఉందని అయితే రాంచరణ్ రంగస్థలం తరువాత ముందు సందీప్ రెడ్డితోనే సినిమా చేస్తాడని సమాచరం.“అర్జున్ రెడ్డి” లాంటి సినిమా తీసిన సందీప్ రెడ్డి రాంచరణ్తో ఏలాంటి సినిమా తీస్తాడో చూద్దాం.