దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై సినిమా రాబోతోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో నటించడానికి మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి సైన్ చేయడంతో షూటింగ్ మే నెల నుండి ప్రారంభించడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు మహి వి.రాఘవ్ సన్నాహాలు చేస్తున్నాడు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర .. ఆ యాత్ర చూపిన ప్రభావం .. ఆయనకి విజయాన్ని అందించిన తీరు ఈ సినిమాలో చూపించనున్నారట. అందువలన ఈ సినిమాకి ‘యాత్ర’ అనే టైటిల్ ను ఖరారు చేశారు
ఇప్పటికే ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో సూర్య నటిస్తున్నారనే వార్తలు బలంగా వినిపించాయి. ఆయన సరసన తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ పేరు ప్రచారంలోకి వచ్చింది. చిత్ర దర్శక నిర్మాతలు ఇటీవలే ఆమెను సంప్రదించారని, ఈ చిత్రంలో ఆమెతో వైఎస్ జగన్ భార్య భారతి పాత్రను చేయించడానికి ట్రై చేస్తున్నారని టాక్.
ఈ సినిమాలో రాజశేఖర రెడ్డి పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని ఎంపిక చేసుకున్నారు. ఆయన సతీమణి పాత్రలో నయనతారను ఎంపిక చేసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, ఆమెను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఎవురు నటిస్తున్నారో అనేది సినిమా యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.