రానా, సాయి పల్లవి కలసి నటిస్తున్న విరాట్ పర్వం సినిమా షూటింగ్ ఇవాల లాంఛనంగా ప్రారంభం అయ్యింది. బాహుబలి చిత్రంతో జాతీయస్థాయి నటుడు అనిపించుకున్న రానా.. ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవితో జోడీ కట్టారు. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.
ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో శుక్రవారం నాడు (జూన్ 15) ప్రారంభమైంది. ఉదయం 10.30 నిమిషాలకు హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ఓపెనింగ్ షాక్కి క్లాప్ కొట్టారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి దర్శకుడు వేణు ఊడుగులకి స్క్రిప్ట్ను అందించారు.
సాయిపల్లవి ఇందులో నక్సలైట్ పాత్రలో నటించబోతుంది. రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. పీరియాడిక్ సోషల్ డ్రామాగా 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూలై మొదటి వారం నుండి జరగనుంది.