Saturday, May 18, 2024
- Advertisement -

రెట్టించిన ఉత్సాహంతో రాశిఖన్నా

- Advertisement -

అప్పుడెప్పుడో ఫస్ట్ సినిమా ఊహలుగుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు సూపర్ హిట్ కొట్టిన రాశిఖన్నా తరువాత టాలీవుడ్ లో రెండేళ్ళ నుండి వరుస సినిమాలు చేస్తున్న ఒక్క సినిమాతో కనీసం యావరేజ్ కూడా దక్కించుకోలేపోయింది. రామ్ తో చేసిన శివమ్, గోపీచంద్ తో చేసిన జిల్ సినిమాలు భారీ ఫ్లాఫులుగా మిగిలాయి.

ఇక రవితేజతో చేసిన బెంగాల్ టైగర్ బిలో యావరేజ్ గానే మిగిలిపోయింది. దాంతో ఇండస్ట్రీలో రాశిఖన్నా అంటే ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది, ఇలాంటి సమయంలో అమ్మడు నటించిన లేటెస్ట్ మూవీ సుప్రీమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 19 కోట్ల షేర్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది.

దాంతో అమ్మడి ఖాతాలో రెండేళ్ళ తరువాత మరో హిట్ పడినట్లై౦ది. సినిమా యావరేజ్ గానే ఉన్న రాశిఖన్నా చేసిన కామెడీ పోలీస్ రోల్ కి మంచి అప్లాజ్ వస్తుండటంతో మరిన్ని అవకాశాలు అమ్మడును వెతుక్కుంటూ వస్తున్నాయట. దాంతో రెట్టించిన ఉత్సాహంతో రాశిఖన్నా ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగాలి అనుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -