Friday, April 19, 2024
- Advertisement -

అతనితో ప్రేమలో పడ్డ అంటున్న రష్మిక మందన్న?

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా , పలు పాన్ ఇండియా మూవీస్ లో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ హీరోయిన్ రష్మిక మందాన్న. సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన “సుల్తాన్ “సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో రష్మిక అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా మూవీ “పుష్ప”లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

రష్మిక మందన సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పడు తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫన్నీ ఫన్నీ వీడియోలు, హాట్‌ ఫోటోలతో నెటిజన్లుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా రష్మిక మందన్నా మరోసారి ప్రేమలో మునిగి తేలుతోందట. అది కూడా కేవలం మూడు మిల్లీ సెకన్లనే పడిపోయిందట. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.

Also read:ఆ ముగ్గురు స్టార్స్ తో నటించాలనుంది.. బాలీవుడ్ నటి కోరికలు మామూలుగా లేవుగా?

ఇక వివరాల్లోకి వెళితే సాధారణంగా ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుందని తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ప్రేమలో పడ్డానని రష్మిక తన ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి ప్రేమలో పడింది మనుషులతో కాదు, తన లిటిల్‌ పెట్‌ జౌరాతో. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నా నాకు దీంతో ఆడుకోవడం చాలా ఆనందంగా వుంది. నా ఆనందానికి కారణమైన లిటిల్‌ పెట్‌ను మీకు పరిచయం చేస్తున్నా. అంటూ తన లిటిల్‌ పెట్‌ జౌరా ఫోటోస్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.

Also read:బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసిన.. ఆర్ఎక్స్ బామ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -